మహేష్ బాబు హీరో గా రాజమౌళి తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా సినిమా లో నటించే నటి నటులు గురించి సర్వత్రా ఆసక్తిని కలిగిస్తుంది. ఈ సినిమాలో హాలీవుడ్, బాలీవుడ్, మాలీవుడ్ సహా పలు సినీ పరిశ్రమల నుంచి నటీనటులను రాజమౌళి ఎంపిక చేస్తున్నారని సమాచారం. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తారని గుసగుసలు వినిపించాయి. ఓం రౌత్-దర్శకత్వం వహించిన ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడిగా నటించిన దేవదత్తా రాజమౌళిని కలవడంతో అసలేం జరుగుతోంది? అన్నచర్చ వేడెక్కిస్తోంది. దేవదత్తా తన ఇన్స్టాగ్రామ్లో ఈ మీటింగుకి సంబంధించిన ఫోటోలను షేర్ చేసాడు. మహేష్ బాబుతో SSMB 29 లో నటిస్తున్నాడంటూ ప్రచారం జోరుగా సాగుతుంది. దేవదత్తా దర్శకుడు రాజమౌళితో కలిసి ఉన్న ఫోటో నెట్టింట వైరల్ గా మారింది .
SSMB 29 కాస్టింగ్ పై సోషల్ మీడియా లో కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్కి కాస్టింగ్ డైరెక్టర్గా వీరేన్ స్వామిని తీసుకున్నారనే ప్రచారం కూడా మొదలయింది. ఆస్ట్రేలియన్ ఆక్టర్ క్రిస్ హెంస్వర్త్ , ఇండోనేషియా యాక్ట్రెస్ చెల్సియా ఇస్లాన్ , బాలీవుడ్ నటి దీపికా పదుకునే, మల్యాలయం సూపర్ స్టార్ మోహన్ లాల్ అంతేకాకుండా ఇంకా ఎంతో మంది స్టార్ నటి నటులను ఫైనల్ చేసారంటూ ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దాదాపు రూ.1000 కోట్ల బడ్జెట్ తో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది.
ఇప్పటికే మహేశ్ లుక్కు సంబంధించిన స్కెచ్లు పూర్తవగా, వాటిల్లో ‘ది బెస్ట్’ను రాజమౌళి, ఆయన టీమ్ సెలక్ట్ చేసి, ఫైనల్ చేయనున్నట్లు సినీ సర్కిల్ లో వినిపిస్తోంది.అలాగే ఈ మూవీ నుంచి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.సాధారణంగా రాజమౌళి తన ప్రీవియస్ సినిమాలకు మాదిరిగా షూటింగ్ కి ముందే మహేష్ మూవీ థీమ్ పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. షూటింగ్ ఎలా జరగబోతుంది? అనే విషయాలు చెప్పబోతున్నాడట. అంతేకాకుండా ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ను రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన కథ, అందులోని పాత్రలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరమైన వివరాలను సంక్షిప్తంగా జక్కన్న చెబుతారట .ఇప్పటికే దీనికి సంబంధించిన వర్క్ కూడా షురూ చేసినట్లు టాక్. త్వరలో ప్రెస్ మీట్ పెట్టి వీడియోని రిలీజ్ చేస్తారా? లేదా మరేదైనా స్పెషల్ అకేషన్ చూసుకుని వివరాలు చెప్తారా అనే విషయంపై త్వరలో క్లారిటీ రానుంది.